Vidhaatha

Latest Telugu News

Menu Icon

అనిల్ అంబానీ బాకీలు రూ.71వేల కోట్లు… సీబీఐ, ఈడీ రంగంలోకి దిగినా చర్యలు లేవు

2012 నుంచి అనిల్‌ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.

విధాత ప్రత్యేకం

మొన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాజకీయ రుతుపవనం తెలంగాణనూ తాకేనా? రేవంత్‌ వద్ద ‘ప్లాన్‌ బీ’ ఉందా?

ఒకవైపు కేరళలో అధిష్ఠానం తన అభిప్రాయాన్ని పక్కనపెట్టి.. పార్టీ నేతల అభీష్టానికి విలువనిచ్చి.. సతీశన్‌ను సీఎం చేసింది. తదుపరి కర్ణాటకలో సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేసింది. మరి తెలంగాణకూ ఈ రాజకీయ రుతుపవనం తాకుతుందా? 2034 వరకూ నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వీలున్న ప్రతివేదికపైనా బలంగా బల్లగుద్దుతున్నారు. దీని వెనుక ప్లాన్‌ బీ ఏమైనా ఉన్నదా?

విధాత ప్రత్యేకం

11 ఏళ్లలో 9.75 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు రైటాఫ్.. బడాబాబుల పట్ల కేంద్రం ఉదాశీనత

దేశంలో దొంగలు పడ్డారు అనేది పాత సామెత. కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ‘బ్యాంకుల్లో గజదొంగలు పడ్డారు’ అనేది కొత్త స్లోగన్‌గా మారిపోయిందనే పరిస్థితి నెలకొన్నది. గడిచిన 11 ఏళ్లలో గుప్పెడు మంది కార్పొరేట్‌ బడాబాబులకు ఏకంగా 9.75 లక్షల కోట్ల రూపాయల రుణాలు రైటాఫ్‌ చేశారంటే.. వారి పట్ల ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉన్నదో అర్థమవుతున్నది. దీనిపై విధాత వరుస కథనాలు. ది గ్రేట్‌ ఇండియన్‌ బ్యాంక్‌ రాబరీ పార్ట్‌ 1 చదవండి..

విధాత ప్రత్యేకం

బాల్క సుమన్‌ ‘విధ్వంస’ వ్యాఖ్యలు యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా?

నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్‌లో జోప్‌ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్‌ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు

కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు

నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. జూన్ 6న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది.

విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు వినియోగించండి : సీఎం రేవంత్ రెడ్డి

విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు వినియోగించండి : సీఎం రేవంత్ రెడ్డి

వానాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ శాఖ వద్దనున్న రూ.1000 కోట్ల నిధులను వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీటీ విధానంపై పిటిషన్‌ను తిరస్కరించి జూన్ 21 పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజ్యసభకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

రాజ్యసభకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఖరారు చేసింది. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి కీలక అడుగుగా భావిస్తున్నారు.